కీళ్ల నొప్పులు - ఇంటి చిట్కాలు !

Telugu Lo Computer
0


మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం వల్ల వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కీళ్ల నొప్పులతో భాద పడుతున్నారు. చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. కొంచెం నొప్పి వస్తే చాలు డాక్టర్ల దగ్గరకు పరుగెడతారు. లేదా పెయిన్ కిల్లర్ మాత్రలను ఎక్కువగా వాడుతారు. ఈ నొప్పులకు ఇంగ్లిష్ మందులకన్నా కూడా ఇంటి చిట్కాలను వాడటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు అని నిపుణులు అంటున్నారు. ఒక టీ స్పూన్ తేనెను, అర టీ స్పూన్ నువ్వులను, పావు టీ స్పూన్ శొంఠి పొడిని తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో తేనెను తీసుకోవాలి. నువ్వులు, శొంఠి పొడి వేసి బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని తినాలి. ఇలా క్రమం తప్పకుండా 15 రోజుల పాటు తీసుకోవడం వల్ల క్రమంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్లల్లో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. అలాగే నువ్వుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు వంటి సమస్య తగ్గడంతో పాటు ఎముకలు, దంతాలు దృడంగా మారుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)