వాలంటీర్లకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ డెడ్ లైన్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు వెంటనే రాజీనామాలు చేసి వైసీపీ ప్రచారంలోకి రావాలని టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ సూచించారు. వైసీపీ కండువా వేసుకుని రాజీనామా చేసి తాను చెప్పిన విధంగా నడుచుకునే వాలంటీర్లు మాత్రమే కొనసాగుతారని , ఇప్పటి వరకు రాజీనామా చెయ్యకుండా, పార్టీ కండువా వేసుకోకుండా ఉండే వాలంటీర్ ఉంటే ఇకపై వారు తమ పార్టీ కోసం పనిచేయరని తేల్చేశారు. టెక్కలి నియోజకవర్గంలో వాలంటీర్లకు మే 3 వరకూ గడువు ఇస్తున్నామని, ఆలోపు వారు రాజీనామాలు సమర్పించి పార్టీ ప్రచారంలోకి వచ్చేయాలని దువ్వాడ శ్రీనివాస్ సూచించారు. లేకపోతే వారు మే 5 తర్వాత వాలంటీర్లుగా ఉండబోరని హెచ్చరించారు. అలాగే రాజీనామా చెయ్యని వాలంటీర్ తమకు అక్కర్లేదని, వారి స్ధానంలో మరొకరిని నియమిస్తామని కూడా తేల్చిచెప్పేశారు. ఈ పదిరోజులు ఎన్నికల్లో ఎవడు పని చేస్తే వాడే తిరిగి ఎన్నికలయ్యాక వాలంటీర్ గా ఉంటారన్నారు.దీంతో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)