చైనా సరిహద్దుల్లో సైనికులతో ప్రధాని మోడీ !

Telugu Lo Computer
0


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా సరిహద్దుల్లో భారత సైనికులతో కలిసి దీపావళి సంబరాలను జరుపుకున్నారు. సైనిక దుస్తులను ధరించిన ఆయన.. మాటామంతి నిర్వహించారు. 2014 నుంచి ప్రతి దీపావళిని సైనికులతో కలిసి ప్రధాని మోడీ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లెప్చా ఏరియాలో సైనికులను కలిసి మాట్లాడిన ఫోటోలను ఆయన ట్వీట్ చేశారు. చైనా సరిహద్దుల సమీపంలోని ఉన్న ఈ ఏరియా అత్యంత కీలకమైన ప్రదేశం. ఆదివారం ఉదయమే ప్రధాని మోడీ ఇక్కడికి చేరుకున్నారు. ఆర్మీ యూనిఫాం ధరించి సైనికులు, అధికారులతో కలిపోయారు. దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 2014లో ప్రధానంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోడీ దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకుంటున్నారు ఏటా ఏదో ఒక సరిహద్దు ప్రాంతానికి ప్రధాని మోడీ వెళ్లి దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకుంటున్న విషయం తెల్సిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)