పూరీ-హౌరా మధ్య వందే భారత్ రైలు ప్రారంభం

Telugu Lo Computer
0


పూరీ-హౌరా నగరాల మధ్య తిరిగే ఈ వందే భారత్ రైలుకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు ప్రారంభోత్సవం చేశారు. ఒడిశాలోని పూరీ స్టేషన్ నుంచి పశ్చిమ బెంగాల్ లోని హౌరా స్టేషన్ల మధ్య తిరిగే ఈ సెమీ హైస్పీడ్ రైలును ప్రధాని మోడీ వర్చువల్ గా పచ్చజెండా ఊపారు. అంతేకాదు, రూ.8 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను కూడా మోడీ ప్రారంభించారు. కాగా, ఒడిశాకు ఇదే తొలి వందే భారత్ రైలు. పూరీ-హౌరా మధ్య 500 కిలోమీటర్ల దూరాన్ని 6.5 గంటల్లో ప్రయాణిస్తుంది. ఈ రైలు మే 20 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)