బ్రిజ్‌భూషణ్‌తో సాక్షిమాలిక్‌ ఫొటో వైరల్‌ !

Telugu Lo Computer
0


బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు కొద్ది రోజులుగా దేశ రాజధాని దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసనకారుల్లో ఒకరైన సాక్షి మాలిక్ వివాహానికి బ్రిజ్‌ భూషణ్‌ హాజరైన ఫొటోలు వైరల్‌ అయ్యాయి. దీనిపై నెటిజన్లు చేస్తోన్న విమర్శలకు సాక్షి కౌంటర్ ఇచ్చారు. '2015-16లో తనను బ్రిజ్‌భూషణ్‌ వేధించారని సాక్షి మాలిక్ ఆరోపించారు. 2017లో జరిగిన ఆమె వివాహానికి ఆయన హాజరయ్యారు. తనను వేధించిన ఓ వ్యక్తిని ఏ అమ్మాయి అయినా తన పెళ్లికి ఆహ్వానిస్తుందా ?' అంటూ ఓ నెటిజన్‌ సాక్షి వివాహం నాటి ఫొటోను షేర్ చేశారు. దీనికి సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. 'అవును ఆమె పిలుస్తుంది. వేధించే వ్యక్తి చేతిలో అధికారం ఉన్నప్పుడు ఆమెకు ఎలాంటి అవకాశం ఉండదు. మహిళలు తమ సొంత కుటుంబంలోనే వేధింపులకు గురవుతుంటారు. కానీ అందరి ముందు అంతా బాగానే ఉన్నట్టు నటిస్తుంటారు. వేధింపులకు పాల్పడేవారు, వారికి మద్దతు తెలిపేవారు ఈ భూమిపై నుంచి తుడిచిపెట్టుకుపోతారని నేను ఆశిస్తున్నా' అంటూ చిన్మయి రెజ్లర్లకు మద్దతుగా ట్వీట్ చేశారు. దీనికి సాక్షి మాలిక్‌ రీట్వీట్ చేసి.. తన అభిప్రాయం అదే అనే విధంగా విమర్శకులకు బదులిచ్చారు.


Post a Comment

0Comments

Post a Comment (0)