మొర్రి పండు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాదు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో  మొర్రి పండు విరివిగా దొరుకుతుంది.   ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ చెట్లు పొలాల గట్ల ఇరువైపులా కనిపిస్తాయి. ఈ కాయలు తియ్యగా పుల్లగా ఉంటాయి. ఈ చెట్టు నిండా సన్నని ముళ్ళు ఉంటాయి. మొర్రి పండ్లలో అనేక ఆరోగ్య  ప్రయోజనాలున్నాయి.  పిల్లల్లో ఎదుగుదలకు ఈ పండ్లు బాగా ఉపయోగపడ్తాయి. వీటిని  పిల్లలు తినడం వల్ల దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా మారుతారు. ఈ కాయలు పచ్చగా ఉన్నప్పుడు పచ్చ రంగులో, దోరగా ఉన్నప్పుడు ఎరుపు రంగులో, పండినప్పుడు నల్లగా ఉంటాయి. మొర్రి పండ్లు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. వీటి పెరుగుదలలో రసాయనాలు ఉండవు కాబట్టి వీటిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మొర్రి పండ్లలో ఒక గింజ మాత్రమే ఉంటుంది. కానీ ఈ గింజకు డ్రై ఫ్రూట్ మార్కెట్‌లో బంగారంతో సమానం అని చెప్పవచ్చు. అయితే ఈ గింజతో కలిపి పండును మొత్తం తింటూ ఉంటారు. మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలను అందించడంలో ఈ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. మొర్రి పండ్లను బొటానికల్ పేరు బుంచనానియా లాటిఫోలియా. ఇతర సాధారణ పేరు చిరోంజి పండు. ఇది జాము ద్రాక్షతో సమానమైన రుచిని కలిగి ఉంటుంది. మొర్రి పండ్లు పీచు, విటమిన్ బి1, బి2, సి, నియాసిన్, ఐరన్, కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ బెర్రీ రకం పండ్లను ఎండబెట్టి, పండు గింజలను డెజర్ట్‌లలో ఒక పదార్ధంగా ఉపయోగిస్తారు. చిరోంజీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. చిరోంజి మలబద్ధకం సమస్యలో ప్రయోజనాలను అందించడంలో సహాయపడుతుంది. దీని ప్రభావం చల్లగా ఉంటుంది. ఇది మీ పొట్టకు చల్లదనాన్ని ఇస్తుంది. ఇటువంటి పోషకాలు చిరోంజి లోపల కూడా కనిపిస్తాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)