65 ఏళ్లు పైబడిన వారూ కూడా అవయవాలు స్వీకరించొచ్చు! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 16 February 2023

65 ఏళ్లు పైబడిన వారూ కూడా అవయవాలు స్వీకరించొచ్చు!


మరణించిన దాతల నుంచి 65 ఏళ్లు పైబడిన రోగులు కూడా అవయవాలు స్వీకరించేందుకు తమ పేరును నమోదు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ''గతంలో గరిష్ఠ వయోపరిమితి 65 ఏళ్లు ఉండేది. ఇప్పుడు ఈ నిబంధన తొలగించడంతో ఏ వయసులో ఉన్నవారైనా మరణించిన వ్యక్తుల నుంచి అవయవాలు తీసుకోవచ్చు'' అని ఓ అధికారి పేర్కొన్నారు. అంతేకాదు.. అవయవాలు స్వీకరించే రోగుల నుంచి నివాస ధ్రువపత్రాలను అడగకూడదని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. రిజిస్ట్రేషన్‌ కోసం ఫీజులు కూడా వసూలు చేయకూడదని పేర్కొంది.

No comments:

Post a Comment