డ్రోన్‌తో ఔషధాల తరలింపు

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్‌ లోని రిషికేష్‌ ఎయిమ్స్‌ ఆసుపత్రి నుంచి రెండు కిలోల బరువున్న టీబీ మందులను ఉత్తరాఖండ్‌ గర్వాల్‌ జిల్లాలోని పర్వత ప్రాంతం తెహ్రీలోని ఓ ఆసుపత్రికి డ్రోన్‌ ద్వారా గురువారం తరలించారు. మందుల సరఫరాలో డ్రోన్ల వినియోగంపై టెస్ట్‌ డ్రైవ్‌లో భాగంగా పరీక్షించారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మాట్లాడుతూ డ్రోన్‌ వినియోగంతో ఔషధాల తరలింపు సమయం రెండు గంటల నుంచి 30 నిమిషాలకు తగ్గిందన్నారు. పర్వత ప్రాంతాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా తరలించగలిగామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)