21వతేదీ వరకు ఉరుములు, మెరుపులతో వడగళ్ల వానలు

Telugu Lo Computer
0


పలు రాష్ట్రాల్లో ఈ నెల 21వతేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి 21 ఏప్రిల్ వరకు బలమైన గాలులు, వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఈ కాలంలో ప్రజలు సురక్షితంగా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని భారత మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)