దేశంలో 1,247 కొత్త కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో రోజువారి కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. నిన్న రెండు వేలకు పైగా నమోదు అయిన కేసులు నేడు వెయ్యికి దిగివచ్చాయి. గడిచిన 24 గంటల్లో 4,01,909 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 1,247 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు  కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,45,527కి చేరింది. నిన్న కరోనా కారణంగా ఒకరు మృతి చెందారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,21,966కి చేరింది. 928 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని 1,985జయించిన వారి సంఖ్య 4,25,11,701కి చేరింది. ప్రస్తుతం దేశంలో 11,860 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.76 నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 16.89లక్షల మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1.86కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)