అమెరికాలోని లాస్ఏంజిల్స్లో సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా అందించే 66వ 'గ్రామీ అవార్డుల' ప్రదానోత్సవం ఈరోజు అట్టహాసంగా జరిగాయి. ఈ ప్రతిష్టాత్మక మ్యూజిక్ అవార్డ్ షోకు స్టార్ సింగర్ ట్రెవర్ నోహ్ హోస్ట్గా వ్యవహరించగా, పలువురు టాప్ ఆర్టిస్టులు వేదికపై లైవ్ ఫర్ఫార్మెన్స్ చేసి అదరగొట్టారు. ఈ అవార్డు వేడుకలలో ఇండియన్ మ్యూజిక్ ఆర్టిస్టులు శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ సత్తా చాటారు. వీరు కంపోజ్ చేసిన 'దిస్ మూమెంట్' అనే ఆల్బమ్ కు గ్రామీలో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు అందుకోగా.. ఈ పాటను 8 మంది శక్తి అనే బ్యాండ్ పేరుతో కలిసి కంపోజ్ చేశారు. ఇందులో జాకీర్ హుస్సేన్ (తబ్లా), శంకర్ మహదేవన్(సింగర్), వి సెల్వగనేశ్ (పెర్కషనిస్ట్), జాన్ మెక్ లాగ్లిన్ (గిటార్) గనేశ్ రాజాగోపాలన్ (వయోలిన్) కంపోజ్ చేశారు. దీంతో పాటు జాకిర్ హుస్సేన్ మరో గ్రామీ అవార్డుని కూడా అందుకున్నారు. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరిలో 'పాస్తో' ఆల్బమ్ కి బెలా ఫ్లెక్, ఎడ్గర్ మేయర్, రాకేష్ చౌరాసియా, జాకిర్ హుస్సేన్లు కలిసి ఈ అవార్డు అందుకున్నారు. మొత్తంగా ఈ ఈవెంట్లో ఆరుగురు భారతీయులు గ్రామీ అవార్డులు అందుకోవడం విశేషం. జాకీర్ హుస్సేన్కు మూడు అవార్డులు, రాకేష్ చౌరాసియాకు రెండు అవార్డులు రాగా.. శంకర్ మహదేవన్ ఒకటి అందుకున్నాడు.
జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్ కు గ్రామీ అవార్డులు
February 05, 2024
0
Tags