ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఇంగ్లండ్పై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా అశ్విన్ రికార్డులకెక్కాడు. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్ను ఔట్ చేసిన అశ్విన్ ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్పై 96 వికెట్లు పడగొట్టాడు. కాగా అంతకముందు ఈ రికార్డు భారత మాజీ లెగ్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ పేరిట ఉండేది. 1964-79 కాలంలో అతడు ఇంగ్లండ్పై టెస్టుల్లో 95 వికెట్లు పడగొట్టాడు. అయితే తాజా మ్యాచ్తో 45 ఏళ్ల చంద్రశేఖర్ ఆల్టైమ్ రికార్డును అశూ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో అశ్విన్ తర్వాతి స్ధానాల్లో చంద్రశేఖర్ (95), అనిల్ కుంబ్లే (92), బిషన్ సింగ్ బేడీ (85), కపిల్ దేవ్ (85), ఇషాంత్ శర్మ (67) ఉన్నారు. అదేవిధంగా ఈ మ్యాచ్లో అశ్విన్ మరో వికెట్ పడగొడితే టెస్టుక్రికెట్లో 500 వికెట్లు సాధించిన క్లబ్లో చేరుతాడు.
అరుదైన ఫీట్ను సాధించిన రవిచంద్రన్ అశ్విన్
February 05, 2024
0
Tags