కుమారుడికి మెసేజ్ చేసి తల్లి ఆత్మహత్య

Telugu Lo Computer
0

హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో పనిచేసే చోట కొందరు ఇబ్బంది పెడుతుండటంతో భరించలేక ఓ మహిళ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రమణమ్మ(50) గత ఐదు సంవత్సరాలుగా మూసాపేట వై జంక్షన్ లో గల చెన్నై సిల్క్స్ షాపింగ్ మాలులో హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పని చేస్తుంది. ఈ రోజు ఉదయం విధులకు హాజరైన రమణమ్మ, తాను పని చేయాల్సిన రెండవ అంతస్తులో కాకుండా, బిల్డింగ్ పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు రమణమ్మ తనను పని చేసే చోట కొందరు ఇబ్బందులకి గురి చేస్తున్నారని తన కుమారుడికి ఆడియో మెసేజ్ పంపించి ఆత్మహత్యకు పాల్పడింది. అది విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. తల్లి ఫోన్ కు కాల్ చేస్త లిప్ట్ చేయలేదు. దీంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు పరుగున షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చే సరికి జరగరానిది జరిగిపోయింది. తల్లి బిల్డింగ్ పై నుంచి కిందికి దూకి అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. షాపింగ్ మాల్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు ఆత్మహత్యకు కారణమైన వారి పై చర్యలు తీసుకోని న్యాయం చేయాలని మృతురాలి బంధువులు షాపింగ్ మాల్ ఎదురుగా ఆందోళన చేపట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)