బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు మొదలయ్యాయి. రాయలసీమలోని తిరుపతి, తిరుమల, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ ద్రోణి ప్రభావంతో తీవ్రంగా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇక్కడ వర్షాలు మొదలయ్యాయి. ఓ వైపు చలి, మరోవైపు వర్షపు జల్లులతో జనాలు అల్లాడిపోతున్నారు. తిరుమలలో ఒక్కసారిగా వాతావరణమంతా పూర్తిగా మారిపోయింది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి, తిరుమల, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వానలు పడుతున్నాయి. నేడు రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాలతో పాటు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి !
January 09, 2024
0
Tags