శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. గొంతులో కఫం పేరుకుపోయి, శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది తలెత్తుతుంది. జలుబు తేలికగా తగ్గకపోతే కొంతమంది యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. అయితే యాంటీ బయాటిక్స్ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుంచి బయటపడేందుకు చాలా సమయం పడుతుంది. ఈ పరిస్థితిలో వంటింటి ఇంటి చిట్కాలు ఉపయోగపడతాయి.
* రోజుకు రెండుసార్లు ములేటి టీ తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. 1/2 అంగుళాల ముల్లేతి రూట్, తురిమిన అల్లం వేడి నీటిలో వేసి బాగా మరిగించాలి. దీనితో రుచి కోసం కొంచెం తేనెను కలుపుకుని తాగితే హాయిగా ఉంటుంది.
* జలుబు, దగ్గుకు రోజుకు మూడుసార్లు తేనె, నిమ్మకాయ టీ తాగితే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. వేడి నీటిలో రెండు చెంచాల తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి. తేనెలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
* పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి గొంతు నొప్పి, మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, మిరియాల పొడి, తేనె కలిపి తాగాలి.
* జలుబు, దగ్గుకు అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది. దగ్గు వచ్చినప్పుడు అల్లం ముక్కను నోటిలో పెట్టుకున్న ఫలితం ఉంటుంది. ఇది గొంతు నొప్పి నుంచి చక్కని ఉపశమనం కలిగిస్తుంది. వేడినీరు లేదా టీతో అల్లం మరిగించి, దానిలో తులసి ఆకులు, మిరియాల పొడి వేసుకోవాలి. ఈ టీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది గొంతు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని కూడా క్లియర్ చేస్తుంది. ఈ టీలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.