ఏడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేను ఓడించిన రోజూవారీ కూలీ !

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లో ఓ రోజూవారీ కూలీ ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించి చరిత్ర సృష్టించాడు. ఈశ్వర్‌ సాహు  రోజూ వారీ కూలీ. ఇటీవలే కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఈశ్వర్‌ కొడుకు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు సాహు కుమారుడిపై మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారు. అయితే ఈ కేసులో దోషులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సాహు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే అదునుగా చూసుకున్న కమలం పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సాహుని సాజా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపారు. అక్కడ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రవీంద్ర చౌబేపై పోటీలో నిలబెట్టారు. రవీంద్ర చౌబే గతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఇక్కడ బీజేపీ వ్యూహం ఫలించింది. అనుకున్నట్లే సాహు.. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రపై గెలుపొంది చరిత్ర సృష్టించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)