ప్రధాని మోడీ "చెడు శకునం" !

Telugu Lo Computer
0

రాజస్థాన్ లోని జలోర్‌లో మంగళవారం జరిగిన ర్యాలీలో  రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ ఒక ''చెడు శకునం'' అని అన్నారు. ప్రధాని మోడీ వెళ్లడం వల్లే ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిందని విమర్శించారు. ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ 'మన ఆటగాళ్లు దాదాపుగా ప్రపంచకప్ గెలుచుకున్నారు. కానీ చెడు శకునం వారిని ఓడిపోయేలా చేసింది'' అంటూ దుయ్యబట్టారు. నవంబర్ 25న రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ని అధికారం నుంచి దించాలని బీజేపీ, మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పోటాపోటీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రధానంగా కులగణన హమీని ఇస్తుంటే.. బీజేపీ రాజస్థాన్‌లో మహిళలపై అత్యాచారాలను అడ్డుకుంటామని, కాంగ్రెస్ అవినీతిని బయటపెడతామని ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)