పన్నీర్‌సెల్వంపై ఆదాయానికి మించిన కేసు - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 31 August 2023

పన్నీర్‌సెల్వంపై ఆదాయానికి మించిన కేసు


మాజీ ఎఐఎడిఎంకె నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వంకు , ఆయన బంధువుకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నోటీస్‌లు జారీ చేయాలని మద్రాస్ హైకోర్టు గురువారం ఆదేశించింది. 2012లో ఈ కేసును ట్రయల్ కోర్టు విచారించగా, ఇప్పుడు హైకోర్టు ఆ కేసును తిరిగి విచారణకు స్వయంగా స్వీకరించింది. ఈ కేసులో రాజకీయ పలుకుబడి ఉపయోగించి ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, అండ్ యాంటీ కరప్షన్(డివిఎసి), రాష్ట్ర ప్రభుత్వాన్ని, కోర్టును పెడతోవ పట్టించి పన్నీర్‌సెల్వంకు అనుకూలంగా వ్యవహరించారని జడ్జి పేర్కొన్నారు. జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ తన అధికారాలను ఉపయోగించి స్వయంగా ఈ కేసును తిరిగి విచారణకు స్వీకరించారు. పన్నీర్‌సెల్వం, ఆయన భార్య విజయలక్ష్మి( దివంగతురాలు) కుమారుడు రవీంద్రనాథ్ కుమార్, ఆయన సోదరులు ఒ రాజా, ఒ బాలమురుగన్, వారి భార్యలు సెప్టెంబర్ 27న కోర్టు ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రప్రభుత్వం కూడా ఆరోజు హాజరు కావాలని ఆదేశించింది.

No comments:

Post a Comment