డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నముగ్గురి అరెస్ట్

Telugu Lo Computer
0

ఢిల్లీలో డ్రోన్ల ద్వారా డ్రగ్స్ ని సరఫరా చేస్తున్న ముగ్గురిని ఢిల్లీ పోలీసు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కు చెందిన మాదకద్రవ్యాల ముఠాలో భాగస్వాములైన ముగ్గురు భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ కు చెందిన నిందితులు మల్కిత్ సింగ్, ధర్మేంద్ర సింగ్, హర్పాల్ సింగ్ ను కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ స్పెషల్ సెల్ ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ లో అరెస్టు చేసింది. డ్రగ్ మాఫియాల నుంచి హవాలా నెట్ వర్క్ ద్వారా పాక్ కు బదిలీ చేసిన డబ్బుకు బదులుగా.. నిందితులు డ్రోన్ల ద్వారా పంజాబ్, ఇతర రాష్ట్రాల్లో డ్రోన్ల ద్వారా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారని తెలిపారు పోలీసులు.

Post a Comment

0Comments

Post a Comment (0)