ప్రాణహాని ఉందంటూ మోడీ, అమిత్ షాలకు రాజాసింగ్ లేఖ

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు లేఖ రాశారు. ఉగ్రవాద సంస్థల నుంచి తమకు ప్రాణముప్పు పొంచి ఉందని, భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఇటీవల ఉగ్రవాద కార్యాకలాపాలకు పాల్పడుతున్నవారిని పోలీసులు పట్టుకున్న క్రమంలో మోడీ, అమిత్ షాలకు రాజాసింగ్ లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించడంతో పాటు బాంబ్‌లతో తమపై దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నారనే విషయం తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని రాజాసింగ్ లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే దేశ విదేశాల నుంచి తనను చంపేస్తానంటూ అనేక బెదిరింపు కాల్స్ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తనకు భద్రత కల్పించాల్సిందిగా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందనే కారణంతో రాజాసింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం గతంలో బుల్లెట్ వెహికల్ కేటాయించింది.. కానీ సెక్యూరిటీని మాత్రం పెంచలేదు. అయితే పలుమార్లు ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మొరాయించింది. రాజాసింగ్ సైతం దీనిపై అసహనం వ్యక్తం చేశారు. ఇక తనకు సెక్యూరిటీని పెంచాలని పలుమార్లు సీఎం కేసీఆర్‌కు కూడా రాజాసింగ్ లేఖలు రాశారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి రాజాసింగ్ ఫిర్యాదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)