ఢిల్లీ నుంచి సిడ్నీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపు కారణంగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణంలో విమానంలో భారీ కుదుపు కారణంగా ప్రయాణికులు ఒక్కసారిగా వణికిపోయి ఆందోళనకు గురయ్యారు. ఎయిరిండియాకు చెందిన బీ787-800 విమానం ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటి తర్వాత విమానం గాల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ ఒడిదొడుకులకు లోనైంది. ఒక్కసారిగా విమానం భారీ కుదుపునకు లోనుకావడంతో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా వణికిపోయారు. ఈ క్రమంలో కుదుపు కారణంగా విమానంలోని ప్రయాణికుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన విమాన సిబ్బంది అందులో ప్రయాణిస్తున్న ఓ వైద్యుడు, నర్సు సహాయంతో వారికి ప్రథమ చికిత్స చేశారు. దీంతో, ప్రమాదం తప్పింది అని డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. విమానం సిడ్నీ ఎయిర్పోర్టుకు చేరుకోగానే వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపింది. అందులో ముగ్గురు వైద్య సహాయం తీసుకున్నారని, మరెవరికీ ఆసుపత్రిలో చేరిక అవసరం కాలేదని సిడ్నీలోని ఎయిరిండియా మేనేజర్ తెలిపారు. ఈ ఘటన ప్రమాణికులను చేదు అనుభవాన్ని మిగిల్చింది.
విమానం భారీ కుదుపుతో ప్రయాణికులకు గాయాలు !
May 17, 2023
0
Tags