విమానాశ్రయంలో హైటెక్ భిక్షాటన !

Telugu Lo Computer
0


బెంగళూరు విమానాశ్రయంలో విఘ్నేశ్ అనే 27 ఏళ్ల యువకుడు చక్కగా తయారయ్యి  విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు చెన్నైకి టికెట్ కొనుగోలు చేశాడు. లోపలికి వెళ్లిన తర్వాత తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని, వెంటనే వైద్యం అందించాలని, అందుకు లక్షల్లో ఖర్చు అవుతుందని ప్రయాణికుల్ని అడుగుతూ తిరిగాడు. ఇలా సుమారు రూ. ఏడు వేల నుండి రూ. 10 వేలు ఇవ్వాలంటూ వేడుకున్నాడు. మీరిచ్చే డబ్బులు వల్ల తన తండ్రిని బ్రతికించిన వాళ్లు అవుతారంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పడం మొదలు పెట్టాడు. అలా చాలా మందిని యాచించాడు. అతడి ప్రవర్తన చూసిన కొందరు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. విఘ్నేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనిపై 420 సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. యువకుడి నుంచి 26 క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాటిలో 24 క్రెడిట్ కార్డులు పనిచేస్తున్నాయని పోలీసులు తెలిపారు. అయితే ఇదంతా ఓ గ్యాంగ్ పనేనని, అందులో విఘ్నేశ్ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో కూడా బెంగళూరు విమానాశ్రయంలో ఇటువంటి ఘటనే జరగ్గా, ముంబయి విమానాశ్రయంలో కూడా ఈ తరహా సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)