హైదరాబాద్లో కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అలియంట్ గ్రూపు సెంటర్ను ఓపెన్ చేయనున్నది. ఆ కంపెనీ దాదాపు 9 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కంపెనీకి చెందిన సీఈవో ధవల్ జాదవ్ను హూస్టన్లో మంత్రి కేటీఆర్ కలిశారు. కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్లో పవర్హౌజ్గా పేరుగాంచిన అలియంట్ గ్రూపు, హైదరాబాద్లోని బీఎఫ్ఎస్ఐ రంగాన్ని బలోపేతం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంలో ఆ సంస్థ కొత్తగా 9 వేల మందిని రిక్రూట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ట్యాక్స్, అకౌంటింగ్, ఆడిట్ సర్వీస్, ఐటీ టెక్నాలజీకి చెందిన యువతకు ఇదొక సదావకాశం అవుతుందని మంత్రి తెలిపారు. బీఎఫ్ఎస్ఐ పరిశ్రమకు హైదరాబాద్ నగరం కేంద్ర బిందువుగా మారుతోందని, అలియంట్ సంస్థ తీసుకున్న నిర్ణయం ఆ నగరంపై ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూపుతుందని మంత్రి తన ట్వీట్లో వెల్లడించారు. హూస్టన్లో ఉన్న అలియంట్ గ్రూపు ప్రధాన కార్యాలయానికి వెళ్లిన మంత్రి కేటీఆర్కు అక్కడ ఘన స్వాగతం లభించింది.
హైదరాబాద్కు అలియంట్ గ్రూపు !
May 20, 2023
0
Tags