మంత్రి పెద్దిరెడ్డి, మిథున్రెడ్డికి తప్పిన ప్రమాదం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, అతడి కుమారుడు ఎంపి మిథున్ రెడ్డి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న సంఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద జరిగింది. ఎంపి మిథున్ రెడ్డి తన బంధువుల ఇంటికి వెళ్తుండగా ఆయన వాహనాన్ని ఎదురుగా కారు ఢీకొట్టడంతో వాహనం పల్టీలు కొట్టింది. కాన్వాయ్ లో ఎంపి వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. మంత్రి పెద్ది రెడ్డి, ఎంపి మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులంతా ఒకే కారు ఉండడంతో ప్రమాదం తప్పింది. పుంగనూరు నుంచి వీరబల్లిలోని అత్తగారింటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)