పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సోమవారం భేటీ అయ్యారు. ఆ రాష్ట్ర సెక్రటేరియట్కు వెళ్లిన గంగూలీ మమత బెనర్జీతో దాదాపు 20 నిమిషాల పాటు పలు విషయాలపై చర్చించారు. ఈ భేటీలో ఎలాంటి అంశాలపై చర్చ జరిగిందో స్పష్టత రాలేదు. మమత బెనర్జీ సోమవారం ఉదయం ముర్షిదాబాద్ లో ఉన్నారు. మద్యాహ్నం సమయంలో ఆమె సెక్రటేరియట్ లోని ఆమె కార్యాలయంకు చేరుకున్నారు. సౌరవ్ గంగూలీ సాయంత్రం 4 గంటల సమయంలో మమత వద్దకు వెళ్లి కలిశారు. భేటీ అనంతరం మమత సైతం కార్యాలయం నుంచి బయలుదేరి ఎస్ఎస్కేఎంకి వెళ్లారు. అయితే, వీరిలో ఎవరూ భేటీకి సంబంధించిన విషయాలు మీడియాతో పంచుకోకపోవటం గమనార్హం. దీంతో, గంగూలీ రాజకీయరంగ ప్రవేశానికి రంగం సిద్ధమైందా అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
మమతా బెనర్జీతో సౌరవ్ గంగూలీ భేటీ !
January 16, 2023
0
Tags