దేశంలో కొత్తగా 176 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో  గడిచిన 24 గంటల్లో 92,944 మందికి పరీక్షలు నిర్వహించగా కొత్తగా 176 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,677,722కు చేరింది. తాజా కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో 2,670 కేసులు యాక్టీవ్ గా ఉన్నట్లు వెల్లడించింది. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందగా..మొత్తం మరణాల సంఖ్య 4,30,707కు చేరుకుంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.80 శాతంగా ఉండగా.. మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.10 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)