చంద్రన్న సంక్రాంతి కానుక తొక్కిసలాటలో ముగ్గురి మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  గుంటూరులో ఆదివారం సాయంత్రం గుంటూరులో జరిగిన 'చంద్రన్న సంక్రాంతి కానుక' వస్త్రాల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు చనిపోయినట్లు, మరికొందరు గాయపడ్డారని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు. గోపిదేశి రమాదేవి, షేక్ మస్తాన్ బీ, సయ్యద్ ఆసీయా అనే ముగ్గురు మహిళలు తొక్కిసలాటలో మరణించారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు సభ అనంతరం సంక్రాంతి కానుకల కోసం జనం తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. అయిదు రోజుల కిందట డిసెంబర్ 28న నెల్లూరు జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)