యాంటీ రేప్ చెప్పులు !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని కలబురగికి చెందిన  పదవ తరగతి చదువుతున్న  విజయలక్ష్మి బిరాదార్ యాంటీ రేప్ చెప్పులు తయారు చేసింది.  విజయలక్ష్మి ఎస్ఆర్ఎన్ మెహతా స్కూల్లో పదవ తరగతి చదువుతున్నది. ఒక నేరస్థుడు బాలిక పై దాడి చేయడానికి ప్రయత్నంచినప్పుడు ఆమె అత్యాచార నిరోధక పాదరక్షలతో వారిని తన్నుతుందని ఆమె వివరించింది. దీని గుండా విద్యుత్ వెళుతుందని చెప్పింది. అంతేకాదు ఇందులో జీపీఎస్ ఫీచర్ ను కూడా కలిగి ఉంది. ఇది అమ్మాయి లైవ్ లొకేషన్ పాటు, అమ్మాయి తల్లిదండ్రులకు మెసేజ్ లను పంపుతుంది. విజయలక్ష్మి  8వ తరగతి చదువుతున్నప్పుడే ఈ ప్రాజెక్ట్ చేయడం ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అనేక అవార్డులు గెలుచుకుంది. ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్వెన్షన్ అండ్ ఇన్నోవేషన్ ఎక్స్ పో అవార్డు గెలుచుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)