న్యూ ఢిల్లీ లోని సెంట్రల్ ఢిల్లీ పాఠశాలలో బాధిత విద్యార్థిని ఐదో తరగతి చదువుతోంది. ఏమైందో తెలియదుగానీ, కిటికీ లోంచి ఆమెను విసిరేయడానికి ముందు విద్యార్థినిపై టీచర్ కత్తెరతో దాడి చేసింది. గమనించిన సహచర ఉపాధ్యాయిని ఒకరు ఆమెను వారించే ప్రయత్నం చేసింది. అయినా వినకుండా కోపంతో విద్యార్థినిని కిటికీలోంచి బయటకు విసిరేసింది. దీంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. పాఠశాలకు వచ్చిన పోలీసులు నిందితురాలిని కస్టడీలోకి తీసుకొని హత్యాయత్నం కేసు నమోదు చేశారు.