ఎస్ఎఫ్ఐ అఖిల భారత ప్రధాన అధ్యక్ష కార్యదర్శులుగా వీపి సాను, మయూక్ బిశ్వాస్ తిరిగి ఎన్నికయ్యారు. హైదరాబాద్ ఠాగూర్ ఆడిటోరియంలో నాలుగు రోజుల పాటు జరిగిన 17వ జాతీయ మహాసభల చివరి రోజు శుక్రవారం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. మొత్తం 83 మందితో కమిటీ ఎన్నికయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఐదుగురికి జాతీయ కార్యవర్గంలో స్థానం దక్కింది. ఎస్ఎఫ్ఐ మహాసభల్లో మొత్తం 35 తీర్మానాలకు ఆమోదం లభించింది.
ఎస్ఎఫ్ఐ ప్రధాన అధ్యక్ష, కార్యదర్శులు వి పి సాను, మయూక్ బిశ్వాస్
December 16, 2022
0
Tags