మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరుగుతున్న జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో నిఖత్ జరీన్ రైల్వేస్కు చెందిన అనామికను 4-1 తేడాతో ఓడించి విజయం సాధించి జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఐదు రౌండ్లలో కేవలం చివరిదాంట్లో మాత్రమే జరీన్ కంటే అనామిక ఎక్కువ పాయింట్లను దక్కించుకోగలిగింది. అంతకుముందు సెమీఫైనల్ 50 కేజీల విభాగంలో ఏఐపీకు చెందిన శివిందర్ కౌర్ను 5-0 తేడాతో ఓడించింది. కామన్వెల్త్ గేమ్స్ 2022, ప్రపంచ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శనతో నిఖత్ టైటిళ్లను గెలుచుకొన్న విషయం తెలిసిందే.
జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్గా నిఖత్ !
December 26, 2022
0