జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిఖత్‌ !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌ లో జరుగుతున్న జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో నిఖత్‌ జరీన్‌  రైల్వేస్​కు చెందిన అనామికను 4-1 తేడాతో ఓడించి విజయం సాధించి జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్​ను కైవసం చేసుకుంది. ఐదు రౌండ్లలో కేవలం చివరిదాంట్లో మాత్రమే జరీన్ కంటే అనామిక ఎక్కువ పాయింట్లను దక్కించుకోగలిగింది. అంతకుముందు సెమీఫైనల్​ 50 కేజీల విభాగంలో ఏఐపీకు చెందిన శివిందర్ కౌర్​ను 5-0 తేడాతో ఓడించింది. కామన్వెల్త్ గేమ్స్ 2022, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో నిఖత్‌ టైటిళ్లను గెలుచుకొన్న విషయం తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)