కేరళకు చెందిన దినేశ్ అనే వ్యక్తి బరువైన బ్యాగ్ తో తమిళనాడులోని చెన్నైలోని పెరుంగళత్తూరు బస్టాప్ లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. దినేశ్ యోగాలో పీజీ పూర్ తిచేశాడు. ప్రస్తుతం పాలవక్కాంలో ఉంటూ వేలచేరి, నీలంగరై, దురైపాకంలోని జిమ్లలో యోగా ట్రైనర్గా పనిచేస్తున్నాడు. దినేశ్ వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులే. వారిలో కొందరు ఒత్తిడి, బరువు తగ్గాలంటూ దినేశ్ సంప్రదించేవారు. అయితే వారికి గంజాయిని తీసుకోవడం ద్వారా ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని సూచించేవాడు. దీంతో తన వినియోగదారులకు గంజాయిని అందించడం కోసం స్వయంగా తానే స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు.
గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న యోగా టీచర్ !
December 18, 2022
0
Tags