చైనా ఉత్పత్తులను బహిష్కరించండి

Telugu Lo Computer
0


చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశీయ ఉత్పత్తుల ధరలు రెట్టింపు ఉన్నా చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత సైనికులతో పీఎల్‌ఏ సైనికులు ఘర్షణకు దిగడాన్ని ఖండించారు. మన సైనికులు దేశానికే గర్వకారణమన్నారు. వారి ధైర్యసాహసాలకు నమస్కరిస్తున్నానన్న కేజ్రీవాల్‌.. ఘర్షణలో గాయపడ్డ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)