నినాదాలతో హోరెత్తించిన సచిన్ పైలట్ మద్దతుదారులు

Telugu Lo Computer
0


రాజస్ధాన్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. రాహుల్ యాత్ర వేదికగా సీఎం అశోక్ గహ్లోట్‌, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ వర్గాల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. భారత్ జోడో యాత్రలో ఆదివారం సచిన్ పైలట్ మద్దతుదారులు ఆయనకు మద్దతుగా నినాదాలతో హోరెత్తించారు. సచిన్ పైలట్ జిందాబాద్‌, మన సీఎం ఎలా అంటే సచిన్ పైలట్‌లా ఉండాలని వారు నినదించారు. ఒక రోజు విరామం అనంతరం జోడో యాత్ర దౌసాలో 14వ రోజు పున:ప్రారంభమైంది. సచిన్ పైలట్‌కు అనుకూలంగా ఆయన వర్గీయులు నినాదాలు చేసిన సమయంలో రాహుల్ వెంట పైలట్‌, అశోక్ గహ్లాట్‌లున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)