దేశంలో కొత్తగా 196 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కొత్తగా 196 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ సోకి ఇద్దరు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 4,46,77,302కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,428 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు 4,41,43,179 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 5,30,695కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 0.01 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.80శాతం, మరణాల రేటు 1.19శాతంగా ఉంది. ఇప్పటివరకు 220.05 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు దేశంలో మూడు బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒక కేసును గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)