మదర్‌ డెయిరీ పాల ధర పెంపు !

Telugu Lo Computer
0


దేశంలోని పలు ప్రాంతాల్లో మదర్ డెయిరీ పాల ధరను రూ.2 పెంచింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రేపటి  నుంచి ధర పెంపు నిర్ణయం అమల్లోకి రానుంది. ఆవు పాలు, టోకెన్ మిల్క్ వేరియంట్‌ల ఎంఆర్‌పీ లో ఎటువంటి పెంపు ఉండదని పేర్కొంది. ఈ సంస్థ రెండు నెలల్లో పాల ధరలను పెంచడం ఇది రెండోసారి కాగా, ఏడాది వ్యవధిలో ఇది ఐదోసారి. డెయిరీ ఫుల్‌క్రీమ్ మిల్క్‌పై లీటర్‌కు రూ.2 పెంచడంతో రూ.66 చేరకోగా, టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ.51 నుంచి రూ.53కి చేరుకుంది. డబుల్ టోన్డ్ పాల ధర లీటరుకు రూ.45 నుంచి రూ.47కి పెరిగింది. అయితే ఆవు పాలు, టోకెన్ (బల్క్ వెండెడ్) పాల వేరియంట్‌ల ధరలను పెంచకూడదని మదర్ డెయిరీ నిర్ణయించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)