తమిళనాడు రేషన్ దుకాణాల్లో 2,5 కిలోల వంటగ్యాస్ సిలిండర్ విక్రయాలను మంత్రి పెరియస్వామి ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ సంస్థ పేదల కోసం మినీ సిలిండర్లను విక్రయిస్తోంది. సహకార దుకాణాల ద్వారా విక్ర యించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తేనాంపేటలోని ట్రిప్లికేన్ రేషన్ దుకాణంలో ఈ విక్రయాలను మంత్రి పెరియస్వామి గురువారం ప్రారంభించారు. వీటితో పాటు కిరాణా సరుకులు, సబ్బు, టూత్పే్స్ట, బిస్కెట్ వంటి 24 వస్తువుల విక్రయాలను కూడా మంత్రి ప్రారంభించారు.
తమిళనాడు లో మినీ సిలిండర్ విక్రయాలు
October 08, 2022
0