తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్ రేగుపతి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్లను నిషేధించే బిల్లును బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రమ్మీ, పోకర్తో సహా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ప్లాట్ఫారమ్లను నిషేధించడానికి బిల్లు ప్రవేశపెట్టబడింది. ఈ ఆన్లైన్ గేమ్స్ను నిషేధించడానికి తాము కట్టుబడి ఉన్నామని మార్చిలో తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు అప్పుడే చెప్పింది. అక్టోబర్ 7న, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్ను నియంత్రించడానికి ఆర్డినెన్స్ను ప్రకటించారు. జస్టిస్ చంద్రు నేతృత్వంలోని ప్యానెల్ సమర్పించిన ఆధారంగా ఆన్లైన్ రమ్మీ గేమ్లను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు సెప్టెంబర్లో ఆన్లైన్లో జూదమాడడాన్ని నిషేధించే ఆర్డినెన్స్కు తమిళనాడు కేబినెట్ ఆమోదం తెలిపింది.ఆన్లైన్ గ్యాంబ్లింగ్ను చట్టవిరుద్ధం చేసే బిల్లును మంత్రి మండలి ఆమోదించిన తర్వాత, గవర్నర్ తన ఆమోదాన్ని ప్రకటించారు. ఈ చర్యకు ఈ నెల ప్రారంభంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం లభించింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ జూదాన్ని నిషేధించే చట్టాన్ని ఆమోదించడానికి రెండు ప్రయత్నాలు చేసింది. ఈ చట్టం ప్రకారం ఆన్లైన్ గేమ్ల సరఫరాదారులెవరూ ఆన్లైన్ జూదం సేవలను అందించలేరు. నగదుతో ఆడే ఆన్లైన్ జూదం గేమ్స్ను ఇకపై అనుమతించరు.
ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ నిషేధం
October 19, 2022
0
Tags