రామాలయ నిర్మాణ పనులు సగం పూర్తయ్యాయి !

Telugu Lo Computer
0


ఆలయ నిర్మాణ పనులు సగం పూర్తయినట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 2024 మకర సంక్రాంతి రోజున రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించాలన్నది ఆలయ ట్రస్ట్ యోచన. 2020లో రామాలయ నిర్మాణం మొదలు కాగా, 2024లో పూర్తి కానుంది. జైపూర్ లో పంచఖండ్ పీఠం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం యోగి మాట్లాడారు. 1949లో రామమందిరం కోసం ఉద్యమం ఆరంభమైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ చర్యల ఫలితమే ఆలయ నిర్మాణం సగం పూర్తి అయినట్టు చెప్పారు. ఇటీవలే కాలం చేసిన తన గురువు, మార్గదర్శి ఆచార్య ధర్మేంద్రకు ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. రాముడు జన్మించిన చోటే ఆలయాన్ని నిర్మించాలన్నది ఆచార్య కలగా పేర్కొన్నారు.

Tweet

Conversation

Over 50% of the work on the Ram Mandir has neared completion, said Uttar Pradesh CM Yogi Adityanath at an event in Rajasthan: CMO

Post a Comment

0Comments

Post a Comment (0)