గేదెల యజమానులపై కేసు

Telugu Lo Computer
0


వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ హైస్పీడ్ రైలు ముంబై నుంచి గాంధీనగర్ వెళ్తుండగా గురువారం ఉదయం ప్రమాదనికి గురైన విషయం తెలిసిందే. రైలు పట్టాలపై గేదెల మంద అడ్డురావడంతో ఈ ఘటన జరిగింది. రైలు ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది. మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన అత్యాధునిక రైలు ఆరు రోజులకే ప్రమాదానికి గురికావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనపై గుజరాత్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కేసు నమోదు చేసింది. గేదెల యజమానులపై అభియోగాలు మోపింది. వారి నిర్లక్ష‍్యం కారణంగానే గేదెలు పట్టాలపైకి వచ్చాయని, యజమానుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు వారిని ఇంకా గుర్తించలేకపోయినట్లు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)