నదిలో బస్సు పడి 16 మంది మృతి

Telugu Lo Computer
0


నేపాల్‌లోని బారా జిల్లాలో బస్సు అదుపు తప్పి నదిలో పడి 16 మంది మృతి చెందగా 35 మంది గాయపడ్డారు. నేపాల్‌లోని బారా జిల్లాలో బస్సు అదుపు తప్పి నదిలో పడి 16 మంది మృతి చెందగా 35 మంది గాయపడ్డారు. నేపాల్‌లోని బారా జిల్లాలో బస్సు అదుపు తప్పి నదిలో పడి 16 మంది మృతి చెందగా 35 మంది గాయపడ్డారు. నేపాల్‌లోని మాధేష్ ప్రావిన్స్‌లో బస్సు నారాయణగఢ్ నుంచి బిర్‌గంజ్ వైపు వెడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గాయపడిన బాధితులను వైద్య చికిత్స కోసం హెటౌడా, చురే హిల్ మరియు సాంచో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ది రైజింగ్ నేపాల్ వార్తాపత్రిక నివేదించింది. అయితే పలువురిని హెటౌడా ఆసుపత్రికి తరలించినట్టు పోలీసు సూపరింటెండెంట్ బామ్‌దేవ్ గౌతమ్ తెలిపారని 'మై రిపబ్లికా' వార్తాపత్రిక పేర్కొంది. అక్టోబర్ 2న ఈస్ట్-వెస్ట్ హైవేపై బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 36 మంది గాయపడ్డారు. నేపాల్‌లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. దేశం ఎక్కువగా పర్వతాలతో కప్పబడి ఉండటం వల్ల ఇక్కడి రహదారులు చాలా ఇరుకుగా ఉంటాయి. దేశంలో బస్సు ప్రమాదాలు సాధారణంగా ఈ కారణాల వల్లనే జరుగుతుంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)