తదుపరి సిజెఐ పేరును సూచించాల్సిందిగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యు.యు. లలిత్ను కేంద్రం కోరింది. ఈ మేరకు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత సిజెఐ యు.యు. లలిత్ నవంబర్ 8న పదవీవిరమణ చేయనున్నారు. ఆయన తర్వాత సిజెఐగా వరుస ప్రకారం జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుత సిజెఐ తన వారసుడి పేరును సిఫార్సు చేసినట్లైతే నిబంధనల ప్రకారం కొలీజియమ్ సమావేశం నిర్వహించకూడదు. ఇటీవల సీనియర్ న్యాయవాది సహా నలుగురు న్యాయమూర్తుల నియామకంపై కొలీజియం మధ్య విభేదాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలో కేంద్రం ఈ లేఖను పంపినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30న సిజెఐ నియామకం కోసం కొలీజియం నలుగురి పేర్లను పరిశీలించాల్సి వుంది.
సిజెఐ పేరును సూచించండి !
October 07, 2022
0
Tags