సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ వచ్చే నెలలో భారత్కు వస్తున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ద్వారా ప్రధాని మోదీ గత నెలలో పంపిన ఆహ్వానం మేరకే ఆయన భారత్కు వస్తున్నారని సమాచారం. నవంబరు 14వ తేదీ ఉదయం భారత్కు వస్తున్న సల్మాన్ ఆ రోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు. అనంతరం జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియాకు పయనమవుతారు. ఈ పర్యటనలో భాగంగా భారత్లో పెట్టుబడుల అంశంపై మోదీ, సల్మాన్ మధ్య కీలక చర్చలు జరిగే అవకాశముంది.
సౌదీ యువరాజు నవంబర్ 14న భారత్ పర్యటన !
October 24, 2022
0
Tags