తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 15 కేజీల ఉచిత బియ్యం

Telugu Lo Computer
0


ఆగస్టు మాసంలో రేషన్ కార్డు ఉన్న వారికి ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 4వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ పంపిణీ కార్యక్రమం జరగనున్నట్లు తాజాగా ఉత్తర్వులలో పేర్కొంది. ఏప్రిల్ మాసం అలాగే మే మాసాలలో ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ బియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందించలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే మరో ఐదు కిలోల బియ్యాన్ని కూడా ఉచితంగా ఇవ్వలేదు. దీంతో ఈ నెలలో ఆ మొత్తం 15 కేజీల చొప్పున బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు ఇవ్వనుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)