రోజంతా వేడి నీరు తాగకండి !

Telugu Lo Computer
0


కరోనాకు బయపడి చాలా మంది వేడి నీటిని మాత్రమే తాగుతున్నారు. ప్రస్తుత కాలంలో అనారోగ్యానికి గురయ్యేవారి సంఖ్య పెరుగుతోంది. ఆహారం, జీవనశైలిలో మార్పు కారణంగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అనేక రకాల వ్యాధులు నయమవుతాయని నిపుణులు తెలిపారు. అయితే రోజంతా గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల తీవ్రమైన నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి రోజంతా వేడి నీటిని తాగుతారు. దాని వల్ల లాభాలు ఉన్నా, ఎక్కువ తీసుకుంటే నష్టాలు కూడా ఉన్నాయి. రక్తంలో నీరు: బరువు తగ్గేందుకు, పొట్ట తగ్గడానికి రోజంతా వేడినీళ్లు తాగుతున్నట్లయితే.. ఈ అలవాటును మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రక్తంలో నీటి శాతం పెరిగే ప్రమాదం ఉంది. కిడ్నీ మన శరీరంలో ముఖ్యమైన అవయవం. ఇది టాక్సిన్స్ తొలగించడానికి పనిచేస్తుంది. దీని సామర్థ్యం కొంతవరకు నీటిపై ఆధారపడి ఉంటుంది. కానీ వేడి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. రాత్రి పడుకునేటప్పుడు వేడి నీటిని నిరంతరం తాగడం వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ నీరు త్రాగడం వల్ల తరచుగా మూత్రవిసర్జన వస్తుంది. దాహం వేయకపోయినా వేడినీరు ఎక్కువగా తాగితే, సిరలు వాపు సమస్య వస్తుంది. మెదడులోని నరాల్లో మంట వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, రోజులో పరిమిత పరిమాణంలో మాత్రమే గోరువెచ్చని నీటిని త్రాగాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)