చికెన్ సెంటర్ యజమాని హత్య !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి చంద్రబాబు కాలనీలో నివాసం ఉంటున్న చికెన్ సెంటర్ యజమాని స్టాఫ్ రాజా (25)ని శుక్రవారం రాత్రి దుండగులు కత్తితో పొడిచి చంపారు.  చికెన్ సెంటర్ వద్ద రాజు మద్యం మత్తులో ఘర్షణ పడుతుండడంతో మాజీ వాలంటీర్ నాని అనే వ్యక్తి ఈ హత్య చేసినట్టు తెలుస్తోంది. దీంతో నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య విషయం తెలియడంతో డీఎస్పీ మురళి కృష్ణ, అలిపిరి సీఐ అబ్బన్న, ఎస్సై రెడ్డప్ప సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మర్డర్ కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)