కారు ఢీకొని చిన్నారి మృతి

Telugu Lo Computer
0


కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన జంపయ్య, రాజేశ్వరి దంపతులు తిమ్మాపూర్ రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అక్కడే రాజేశ్వరి టిఫిన్ సెంటర్ లో పని చేస్తున్నది. ఆమె కూతురు శివాని గుండ్లపల్లిలో గురుకుల పాఠశాలలో ఐదో తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంది. అయితే తన తల్లిని కలవడానికి బయటికి వచ్చిన శివానిని రహదారిపై అత్యంత వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. సంతోష్ అనే వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ చిన్నారిని ఢీకొట్టాడు. దీంతో ఆ బాలిక 30 మీటర్ల దూరం వరకు ఎగిరిపడింది. తీవ్రగాయాలు కాగా స్థానికులు వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేస్తుండగా మృతి చెందింది. అయితే అప్పటికే మద్యం సేవించి ఉన్న కారులోని ముగ్గురూ ఇంత జరిగినా మళ్లీ సమీపంలోని వైన్స్ వద్దకు వెళ్లి మద్యం తాగి పారిపోయినట్లు గా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)