నిత్యానంద స్వామిజీని పెళ్లిచేసుకుంటా

Telugu Lo Computer
0


రానా దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన 'లీడర్'( 2010) చిత్రం ద్వారా ప్రియా ఆనంద్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అటు తర్వాత రామ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రామ రామ కృష్ణ కృష్ణ', సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన '180' , శర్వానంద్ హీరోగా తెరకెక్కిన 'కో అంటే కోటి' వంటి క్రేజీ చిత్రాల్లో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. అందం, అభినయం కలిగిన ఈ నటి..తమిళంలో బిజీ అవ్వడంతో పదేళ్ళ పాటు టాలీవుడ్ కు దూరమైంది. తెలుగులో ఈమెకు మంచి క్రేజ్ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రియా ఆనంద్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు తాను దేవుడిగా ప్రకటించుకున్న నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాలని ఉందని హీరోయిన్ ప్రియా ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన లాగా ఇలా స్పందించింది ప్రియా ఆనంద్. నిత్యానంద స్వామి అంటే నాకు ఎంతో ఇష్టం ఆయన దగ్గర ఏదో ప్రత్యేకత ఉంది కాబట్టి అందరూ ఆయనను ఇష్టపడతారు అంటూ చెప్పుకొచ్చింది పెళ్లి చేసుకుంటే అతన్ని చేసుకుంటానని షాకింగ్ కామెంట్స్ చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)