భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా కేంద్రం నిర్వహిస్తున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలో అంతా పాల్గొనాలని, అలాగే మీ ప్రొఫైల్ పిక్గా జాతీయ జెండాను పెట్టుకోవాలని మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ కొరారు. ఈ వేడుక ప్రజా ఉద్యమంగా అవతరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2-15వ తేదీల మధ్య ప్రతిఒక్కరూ తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్చర్గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని పిలుపునిచ్చారు..ఈసారి ప్రధాని మోదీ స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ కార్యక్రమం గురించి మాట్లాడారు. ఈసారి 'మన్ కీ బాత్' చాలా ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్న ఈసారి స్వాతంత్ర్య దినోత్సవమే ఇందుకు కారణం. మనమందరం చాలా అద్భుతమైన, చారిత్రాత్మక క్షణానికి సాక్ష్యమివ్వబోతున్నాం. ఆగస్టు 13-15 మధ్య ఇంటింటా మూడు రంగుల జెండాను ఎగురవేయాలని ప్రధాని మోదీ కోరారు. ఫలితంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో ఏదో రూపంలో పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు.
ప్రొఫైల్ పిక్గా జాతీయ జెండాను పెట్టుకోండి !
July 31, 2022
0
Tags