ఛత్తీస్గఢ్లో జరిగిన ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన 10 నెలల బాలికకు రైల్వే శాఖ కారుణ్య నియామకం కింద పాపకు ఉద్యోగం ఇచ్చిందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. చిన్నారికి 18 ఏళ్లు నిండిన తర్వాత నేషనల్ ట్రాన్స్పోర్టర్లో పని చేయవచ్చని వారు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి నియామకం జరగడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. కారుణ్య నియామకాలు మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించడమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. "జూలై 4న, రాయ్పూర్ రైల్వే డివిజన్లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ పర్సనల్ డిపార్ట్మెంట్లో కారుణ్య నియామకం కోసం 10 నెలల బాలిక పేరు నమోదు చేయబడింది. ''బిడ్డ తండ్రి రాజేంద్ర కుమార్ భిలాయ్లోని రైల్వే యార్డులో అసిస్టెంట్గా పనిచేసేవాడు. అతను తన భార్యతో కలిసి జూన్ 1న కారులో వెళుతుండగా రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మరణించారు. అయితే వారి చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది" . "నిబంధనల ప్రకారం రాయ్పూర్ రైల్వే డివిజన్ ద్వారా కుమార్ కుటుంబానికి అన్ని సహాయాలు అందించబడతాయి అని అధికారులు పేర్కొన్నారు. రైల్వే రికార్డుల్లో చిన్నారి పేరు అధికారికంగా నమోదు చేశారు. ఇందుకోసం చిన్నారి వేలిముద్రలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తన బంధువులతో పాటు ఉన్న చిన్నారి బొటనవేలు ముద్రను తీసుకునేటప్పుడు బాలిక ఏడ్చినట్లు ఒక అధికారి గుర్తు చేసుకున్నారు. "ఇది హృదయాన్ని కదిలించే క్షణం. పసి వయసులో ఉన్న ఆ పాప వేలి ముద్ర తీపుకోవడం మాకు కూడా చాలా కష్టంగా అనిపించింది అని అన్నారు.
10 నెలల బాలికకు రైల్వే ఉద్యోగం !
July 08, 2022
0